Warangalvoice

GKM

e-sanjeevani

ఇంటి వద్దకే ఉచిత వైద్య సేవలు

ప్రభుత్వం అందిస్తున్న ‘ఈ-సంజీవని’తో అందుబాటు! హాస్పిటల్ కు వెళ్ళకుండానే వైద్య సేవలు ఉచిత కన్సల్టేషన్ తోపాటు, వాడవలసిన మందుల వివరాలు రాష్ట్రవ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా అందుబాటులో వేలాదిమంది వైద్యులు, స్పెషలిస్టులు వీడియో కాల్ సదుపాయం చికిత్స వివరాలు ఎప్పడంటే అప్పుడు తెలుసుకునే వెసులుబాటు పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ఇప్పుడు అందరి చేతుల్లోనూ స్మార్ట్‌ఫోన్లు ఉంటున్నాయి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని మన జీవితాలను మరింత సులభతరం చేసుకోవచ్చు. ముఖ్యంగా, ఆరోగ్య సంరక్షణ విషయంలో ఇది ఎంతో…

Read More
warangal press club

ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇన్స్యూరెన్స్

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాంఅధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, సదయ్య వరంగల్ వాయిస్, హనుమకొండ : గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సభ్యులకు, వారి కుటుంబాలకు ఇన్స్యూరెన్స్ చేయించి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య తెలిపారు. గురువారం ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రమాద బీమా నమోదు ప్రారంభ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. అనేక కారణాల వల్ల హమీల అమలు…

Read More
crime news

బాలుడి గొంతు కోసిన దుండగులు

మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఘటన వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న ఏడేళ్ల బాలుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన చెందిన ఉపేందర్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రించారు. ఈ క్రమంలో తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో తండ్రితో కలిసి నిద్రిస్తున్న ఉపేందర్ కుమారుడిపై దుండగులు కత్తితో…

Read More
bjp

బీజేపీదే అధికారం

రాష్ర్ట అధ్యక్షులు రాంచందర్ రావు పార్టీలో చేరిన యువ నాయకుడు నరేష్ నాయక్ వరంగల్ వాయిస్, డోర్నకల్ : డోర్నకల్ మండల యువ నాయకుడు ధరావత్ నరేష్ నాయక్ బీజేపీలో చేరారు. డోర్నకల్ మండల కేంద్రం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి మహబుబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగన పార్టీ సమావేశంలో ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షులు రాంచందర్ రావు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు కషాయం కండువ కప్పి ఆవ్వానించారు. ఆయనతో పాటు…

Read More
vijay setupathi

విజయ్‌ సేతుపతిపై మహిళ ఫిర్యాదు

నేనేంటో నా కుటుంబానికి తెలుసన్న సేతుపతి వరంగల్ వాయిస్ (సినిమా) : ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీక్రి వచ్చి స్టార్‌గా ఎదిగారు నటుడు విజయ్‌ సేతుపతి. ఆయనపై ఓ మహిళ ఇటీవల సంచలన ఆరోపణలు చేసింది. కోలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ బాగా ఉందని ఆమె సోషల్‌విూడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. దీంతో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై విజయ్‌ సేతుపతి స్పందించారు. తన కుటుంబం ఎంతో బాధ పడిరదన్నారు….

Read More
kingdom movie review

విజయ్‌ అభిమానులకు పండగ

ప్రేక్షకులను ఆకట్టుకునేలా కింగ్డమ్‌ వరంగల్ వాయస్ (సినిమా):  వరుస సినిమాలు చేస్తున్నా, బాక్సాఫీస్‌ వద్ద మేజిక్‌ క్రియేట్‌ చేయడంలో తడబడుతున్నారు. ఈ నేపథ్యంలో గౌతమ్‌ తిన్ననూరితో కలిసి ఆయన చేసిన తాజా చిత్రం ’కింగ్డమ్‌’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కథలోకి వెళితే…సూరి (విజయ్‌ దేవరకొండ) ఓ కానిస్టేబుల్‌. చిన్న వయసులోనే కుటుంబానికి దూరమైన తన అన్న శివ (సత్యదేవ్‌) జాడ కోసం వెతుకుతుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే పోలీస్‌ అధికారులకీ సూరికి మధ్య గొడవ…

Read More
raghu vamshi

రఘువంశీ స్టోరీ ఆధారంగా…

హానీమూన్‌ ఇన్‌ షిల్లాంగ్‌ మూవీ మేఘాలయలో హనీమూన్‌ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఉదంతం ఆధారంగా బాలీవుడ్‌ సినిమా తీయనున్నారు. ఈ కేసులో వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, అందుకే సినిమా తీసేందుకు తాము ఆమోదం తెలిపామని రాజా రఘువంశీ కుటుంబసభ్యులు చెప్పారు. బాలీవుడ్‌ దర్శకుడు ఎస్పీ నింబావత్‌ డైరెక్షన్‌లో ’హనీమూన్‌ ఇన్‌ షిల్లాంగ్‌’ పేరుతో సినిమా తెరకెక్కనుంది. షూటింగ్‌ కోసం ఇప్పటికే ఏర్పాట్లు- చేస్తున్నట్లు- నింబావత్‌ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు…

Read More
cpi news

కార్పొరేట్ వర్గాలకు మోడీ ఊడిగం

కమ్యూనిజం ప్రపంచ వ్యాప్త సిద్దాంతం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి వరంగల్ లో ద్వితీయ జిల్లా మహాసభలు ప్రారంభం వరంగల్ వాయిస్, వరంగల్ : కార్పొరేట్ వర్గాలకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఊడిగం చేస్తూ పేదల సంక్షేమాన్ని విస్మరిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ జిల్లా సీపీఐ ద్వితీయ మహాసభలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక అబ్నూస్ ఫంక్షన్ హాల్ లో…

Read More
pending chalan

అమ్మ బాబోయ్.. 120 చలాన్లు..!

ద్విచక్ర వాహనం స్వాధీనంవరంగల్ వాయిస్, కాజీపేట : వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కాజీపేట ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ వెంకన్న తన సిబ్బందితో కలిసి బుధవారం కాజీపేట చౌరస్తాలో వాహన తనిఖీలు చేశారు. అదే సమయంలో అటుగా వచ్చిన వాహనదారుడి ద్విచక్రవాహనానికి సంబంధించిన వివరాలను పరిశీలించగా ఏకంగా 120 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ అధికారులు ఒక్క సారిగా ఖంగుతిన్నారు. ఈ చలాన్ల మొత్తం రూ.32,165 కావడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు….

Read More
dommati sambaiah

డీసీసీ అధ్యక్షుడిగా దొమ్మాటి?

రేవంత్, వేం సూచనలతో ఫైనల్ ఏఐసీసీకి చేరిన దస్త్రం ఒకటి, రెండు రోజుల్లో నియామకపు ఉత్తర్వులు పలువురు ఆశావహులకు నిరాశ కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా దొమ్మాటి సాంబయ్య నియామకం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏఐసీసీకి ప్రతిపాదనలు అందినట్లు ప్రచారం సాగుతోంది. డీసీసీ అధ్యక్ష పీఠం తమ వర్గ నాయకుడికి కట్టబెట్టాలని చాలా మంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేసినప్పటికీ అధిష్ఠానం దొమ్మాటి వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. గత పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నుంచి…

Read More