Warangalvoice

GKM

ప్రొఫెసర్ లింగమూర్తి ఆశయాలు స్ఫూర్తిదాయకం

సిరికొండ మధుసూదనాచారి మాజీ వీసీ చిత్రపటానికి నివాళులు.. కుటుంబ సభ్యులకు పరామర్శ వరంగల్ వాయిస్, హనుమకొండ : కాకతీయ విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి ప్రొఫెసర్  లింగమూర్తి నివాసానికి శనివారం తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత, శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి వెళ్లారు. ఇటీవల లింగమూర్తి గారు కన్నుమూసిన నేపథ్యంలో, వారి చిత్రపటానికి పూలమాల వేసి మధుసూదనాచారి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రొఫెసర్ లింగమూర్తి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించి, వారిని పరామర్శించారు. ఈ కష్టకాలంలో కుటుంబానికి…

Read More

ఐటీడీఏలో ‘ప్రజావాణి – గిరివాణి’

ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ ఈ నెల 23న గిరిజన దర్బార్.. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం వరంగల్ వాయిస్, ములుగు : జిల్లాలోని గిరిజన ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న సోమవారం ఏటూరునాగారంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో ‘ప్రజావాణి – గిరివాణి’ (గిరిజన దర్బార్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణంగా ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని,…

Read More

మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాల పటిష్ట అమలు

కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అంగన్‌వాడీ కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ బాల్య వివాహాల నిర్మూలనకు కఠిన చర్యలు చైల్డ్ లైన్ (1098), సఖీ కేంద్రం సేవలపై విస్తృత ప్రచారం వరంగల్ వాయిస్, హనుమకొండ : జిల్లాలో మహిళలు, శిశువులు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా అధికారులు పటిష్టంగా వ్యవహరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మహిళా…

Read More

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 460 కోట్ల రుణాలు.. మహిళా సంఘాల ప్రగతిపై కలెక్టర్ హర్షం వరంగల్ వాయిస్, హనుమకొండ : మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తేనే కుటుంబంతో పాటు గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. బుధవారం హసన్ పర్తిలోని ‘సంస్కృతి విహార్’లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ),…

Read More
Government is committed to the welfare of minorities

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ డాక్టర్ సత్య శారద వరంగల్ తూర్పులో  ‘ఈద్ కా తోఫా’ పంపిణీ పేద ముస్లింలకు రంజాన్ కానుకలు  వరంగల్ వాయిస్, వరంగల్ : రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్ (తూర్పు) నియోజకవర్గ పరిధిలోని క్రిస్టల్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన “ఈద్ కా తోఫా” కార్యక్రమంలో ఆమె…

Read More

రామచంద్రపురం భూ సమస్యల పరిష్కారానికి రీ-సర్వే

జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ 10,500 ఎకరాల సర్వేకు 9 బృందాల ఏర్పాటు.. రైతులు సహకరించాలని వినతి వరంగల్ వాయిస్, మల్లంపల్లి (ములుగు జిల్లా) : మల్లంపల్లి మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామంలో దశాబ్దాలుగా నెలకొన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ప్రకటించారు. బుధవారం రామచంద్రపురం గ్రామ రైతు వేదికలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని, 10,500 ఎకరాల వ్యవసాయ భూమి రీ-సర్వే, హద్దుల గుర్తింపుపై…

Read More

వ్యాపార రంగంలో పద్మశాలీలు ఎదగాలి

డాక్టర్ మార్త రమేష్ ఘనంగా ‘పద్మశాలి వ్యాపార్ నెట్‌వర్క్’ మీట్ వరంగల్ వాయిస్, హైదరాబాద్ (లక్డీకాపూల్) : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పద్మశాలీలు వ్యాపార రంగంలో విశేష అభివృద్ధి సాధించాలని, అందుకోసం పరస్పర సహకారం అవసరమని ప్రముఖ సామాజిక వేత్త డాక్టర్ మార్త రమేష్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఎఫ్ టీసీసీఐ భవనంలో ‘పద్మశాలి వ్యాపార్ నెట్‌వర్క్ (వీపీఎన్)’ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాపారవేత్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన…

Read More

ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

వరంగల్ వాయిస్, ములుగు : ములుగు జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) గోదామును జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్. మంగళవారం తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే త్రైమాసిక తనిఖీల్లో భాగంగా, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ పరిశీలన జరిగింది. అదనపు కలెక్టర్ (రెవిన్యూ) సీహెచ్. మహేందర్ జి తో కలిసి స్ట్రాంగ్ రూమ్‌ను సందర్శించిన కలెక్టర్,…

Read More

కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి

భూములు కోల్పోయిన రైతులకు ఉపాధి కల్పించాలి కేయూ లైబ్రరీ వద్ద నిరుద్యోగ జేఏసీ నాయకుల ధర్నా వరంగల్ వాయిస్, హనుమకొండ/ కేయూ క్యాంపస్ : కాజీపేట (అయోధ్యపురం)లో నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కేయూ జేఏసీ అధ్యక్షులు డి. తిరుపతి డిమాండ్ చేశారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ వద్ద జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై వారు నిప్పులు…

Read More
Mulugu Collector Divakara TS

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి

మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక అయిదు దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. వరంగల్ వాయిస్, ములుగు:  మార్చి 6వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం…

Read More