District News
నగరంలో శంకర్ దాదా ఎంబీబీఎస్
ఏ విద్యార్హత లేకున్నా వైద్యం నకిలీ డాక్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు వివరాలు వెల్లడించిన సీపీ డా. తరుణ్ జోషి వరంగల్ వాయిస్, క్రైం: వరంగల్ నగరంలో ఏలాంటి విద్యార్హత లేకుండానే వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్ తో పాటు అతడి సహాయకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన నకిలీ డాక్టర్ నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక లక్ష 90 వేల రూపాయల నగదుతో పాటు, ఒక ల్యాప్…
భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి
ఆలయాల్లో భక్తుల రద్దీపుట్టలో పాలు పోసి మొక్కులుచల్లంగా చూడాలని ‘నాగన్న’కు పూజలు వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి: నాగుల పంచమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. భక్తి శ్రద్ధలతో పుట్టల్లో పాలు పోయడానికి భక్తులు క్యూ కట్టారు. ఆలయాలను సుందరంగా అలంకరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లోని పుట్టలకు, నాగమయ్యను పూజించడానికి భక్తులు తరలివచ్చారు. అభిషేకాలు, పాలు, పండ్లు, పసుపు కుంకుమతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్, ఉర్సు నాగమయ్య గుడికి…
ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన వ్యక్తిపై పీడీయాక్ట్
వరంగల్ వాయిస్, క్రైం: ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన నిందితుడిపై వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పాటు ఉద్యోగాల పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగుల వద్ద డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న గుంటూరు జిల్లా పట్టాబిపురానికి చెందిన ఎస్.కె.గౌస్, పై వరంగల్ పోలీస్ కమిషనర్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను మీల్స్ కాలనీ ఇన్ స్పెక్టర్ ముస్కా శ్రీనివాస్ నిందితుడు…
అనుమానం.. రెండు ప్రాణాలు బలి
భార్యను నరికి చంపిన భర్త ఆపై పురుగుల మందు తాగి ఆత్మహత్య రెండు నెలల కిందటే వివాహం ఆత్మకూరు మండల కేంద్రంలో విషాదం వరంగల్ వాయిస్, ఆత్మకూరు: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఆత్మకూరు మండలంలో భార్యను హత్య చేసిన ఓ భర్త.. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన తాళ్ల హరీష్, తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గౌరీదేవిపేటకు చెందిన పుష్పలీలకు రెండు నెలల కిత్రం వివాహం జరిగింది. అయితే భార్యకు…
కోనారెడ్డి.. వెలవెల
చెరువు కట్ట తెగి మూడేళ్లు..ఇప్పటికీ పూర్తికాని మరమ్మతు పనులు2వేల ఎకరాల ఆయకట్టుకు నీరందని దుస్థితినాసిరకంగా పనులు.. పట్టించుకోని అధికారులు వరంగల్ వాయిస్, వర్ధన్నపేట: మండలం కేంద్రంలో రైతులకు పెద్దదిక్కు అయినా కోనారెడ్డి చెరువు కట్ట తెగిపోయి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ మరమ్మతులు పూర్తి కాకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు కింద ఆయకట్టు 2000 ఎకరాలు ఇప్పుడు పంట పండించలేని స్థితిలో ఉన్నా కూడా ప్రభుత్వం కోనారెడ్డి చెరువు పనులను చేపట్టిన దాఖలాలు…
హాస్టల్ లో ఫైటింగ్
ముగ్గురు విద్యార్థినులకు గాయాలుకారణాలు బయటకు పొక్కనివ్వని సిబ్బందితల్లిదండ్రుల ఆందోళనతో ఆలస్యంగా వెలుగులోకి వరంగల్ వాయిస్, వరంగల్ టౌన్: నగరంలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ శంభునిపేటలో 9వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థునులకు గొంతుపై కోసినట్లు గాయాలు కావడం నగరంలో సంచలనం సృష్టించింది. ఈనెల 24న సంఘటన జరిగినా గురుకుల సిబ్బంది దీనిని గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. గురుకుల సిబ్బందే ట్రీట్మెంట్ ఇప్పించడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సోమవారం బాధిత విద్యార్థునుల తల్లిదండ్రులు గురుకులం…
తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవిత కాలం పెంచుదాం
వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి రెడ్ క్రాస్ లో పోలీసుల ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం వరంగల్ వాయిస్, క్రైం: యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవితకాలాన్ని పెంచాలని పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి యువతకు పిలుపునిచ్చారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాధితులకు కోసం హన్మకొండ రెడ్ క్రాస్ పిలుపునందుకోని హనుమకొండ డివిజినల్ పోలీసుల ఆధ్వర్యంలో సుబేదారిలోని రెడ్ క్రాస్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పోలీస్ కమిషనర్ డా….
లీడర్ బన్ గయా ఆటోవాలా..
ఉమ్మడి జిల్లాలో ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. నేతలు, లీడర్లు అంతా ఆటో కార్మికులను కలిసి శుభాకాంక్షలు తెలుపడంతో పాటు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, వరంగల్ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, బీజేపీ నేత రాకేష్ రెడ్డి తదితరులు ఆటో నడిపి ఆటో కార్మికులను ఉత్సాహపరిచారు. -వరంగల్ వాయిస్,…
స్వరాష్ట్రంలో బాగుపడ్డ అంగన్వాడీల జీవితాలు
వరంగల్ వాయిస్, జనగాం : తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ టీఎన్ జీవో (తెలంగాణ నాన్ గెజిటడ్ ఆఫీసర్స్) అనుబంధం జనగాం జిల్లా అధ్యక్షురాలు కాసగోని స్వరూపరాణి, కార్యదర్శి గుమ్మడవెల్లి రమాదేవి ఆధ్వర్యంలో స్టేషన్ ఘనపూర్ ప్రాజెక్ట్, రఘునాథపల్లి మండల కేంద్రంలోని కోమళ్ళలో అంగన్వాడీ టీచర్స్ సమావేశం నిర్వహించారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .ఈ సందర్భంగా అధ్యక్షురాలు స్వరూపారాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంగన్వాడీల జీవితాలు బాగున్నాయన్నారు. అలాగే…
చాయ్ వాలాకు సత్కారం
వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : ఎంజీఎం రెండో గేటు ముందు గత 20 సంవత్సరాలుగా టీ కొట్టు నడిపిస్తూ వీధి వ్యాపారం నిర్వహణలో మొదటి స్థానం దక్కించుకున్న మహమ్మద్ మహబూబ్ పాషాని వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ.రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాలకోసం కాకుండా స్వయం కృషితో అభివృద్ది చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ శ్రవణ్, సాయి, శైలజ, శ్రీకాంత్ హోటల్…