District News
రాష్ట్రపతి ముర్ము చిత్రపటాల బహూకరణ
వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ లలో భారత రాష్ట్రపతి గిరిజన మహిళ ద్రౌపది ముర్ము చిత్ర పటాన్ని మహబూబాబాద్ జిల్లా బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్ సమక్షంలో బహూకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రామచంద్ర రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజవర్ధన్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు యాప సీతయ్య,…
ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ వరంగల్ వాయిస్, హనుమకొండ : జిల్లాలో ఉన్న ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ గిరిజన శక్తి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. అనంతరం ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఇప్పటి…
అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ భూపాల్ వరంగల్ వాయిస్, హనుమకొండ : షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాల జీవోలను అమలు చేయాలని అసంఘటిత రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డులను ఏర్పాటు చేయాలని జిల్లా లేబర్ అధికారి కార్యాలయం ముందు వివిధ రంగాల కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ భూపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాల గడుస్తున్న నేటికీ 73…
బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలి
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ వరంగల్ వాయిస్, హనుమకొండ : అంబేద్కర్ సెంటర్ వద్ద బీసీ యువజన సంఘం గ్రేటర్ అధ్యక్షుడు రాసురి రాజేష్ ఆధ్వర్యంలో మంగళవారం బీసీల చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ బీసీ కుల గణన లేకుంటే బీసీల అస్తిత్వం కష్టమేనని, బీసీలకు ప్రస్తుతం అందుతున్న ఫలాలు…
గిరిజన రిజర్వేషన్ పెంపు సాధ్యం కాదన్న ప్రకటన రాజ్యాంగ విరుద్ధం
తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కమిటీ వరంగల్ వాయిస్, జనగామ : తెలంగాణలో బీసీ-ఈ రిజర్వేషన్ల సమస్య సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున అది పరిష్కారం అయ్యేవరకు గిరిజన రిజర్వేషన్ పెంచడం ఇప్పట్లో సాధ్యం కాదని పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కులను కాలరాయడమేనని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్య చందునాయక్ కేంద్రప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపు అంశాన్ని బీసీ-ఈ…
గొర్రెల, మేకల అనారోగ్య నివారణకు వ్యాక్సిన్
వరంగల్ వాయిస్, వరంగల్ : గొర్రెలు, మేకలు అనారోగ్య నివారణకు, నీలి నాలుక వ్యాధిని అరికట్టేందుకు ముందు జాగ్రత్తగా బ్లుటంగ్ వాక్సిన్ రాష్ట్ర ప్రభుత్వం వేయించడం జరుగుతుందని, దీన్ని గొర్రెలు, మేకల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. పశు వైద్యశాల డాక్టర్ ఝాన్సీ అధ్వర్యంలో శుక్రవారం ఉచిత మందుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు మందులను పంపిణీ చేసి, గొర్రెలకు ఇంజక్షన్లు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన…
నిత్యావసర సరుకుల పంపిణీ
వరంగల్ వాయిస్, వెంకటాపురం నూగూరు : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని టేకుల బోరు అనే ఆదివాసి గ్రామాల్లో గత వారం రోజుల క్రితం వచ్చిన గోదావరి వరదల వల్ల ఊరు మొత్తం మునిగిపోయింది. తదనంతరం అక్కడ ఆదివాసి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని శుక్రవారం అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పీర్ల కృష్ణబాబు ఆధ్వర్యంలో గ్రామంలో 55 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 కేజీల బియ్యం, కేజీ నూనె, కేజీ ఉల్లిగడ్డ,…
పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంఎమ్మెల్యే శంకర్ నాయక్వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అభిప్రాయపడ్డారు. మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలలోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన 47 మంది బాధితులకు మంజూరైన రూ.15,99,500 విలువ గల చెక్కులను అందించారు….