District News
టీయూడబ్ల్యూజే హనుమకొండ జిల్లా అధ్యకుడిగా సుధాకర్
వరంగల్ వాయిస్, హనుమకొండ : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (హెచ్-143) హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా మహా న్యూస్ సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ మస్కపురి సుధాకర్ ను నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని యునియన్ సభ్యులందరితో సంప్రదించి ఈ నిర్ణయాన్ని వెల్లడించినట్టు తెలిపారు. గతంలో తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, యూనియన్ రాష్ట్ర కమిటీ…
యూట్యూబ్ లో చూసి.. నకిలీ నోట్లు ముద్రించి
దొంగనోట్ల ముఠా అరెస్ట్ నిందితులంతా ఉమ్మడి జిల్లా వారే వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్ జోషి వరంగల్ వాయిస్, క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యూట్యూబ్ సహాయంతో నకిలీ నోట్లను ముద్రించి వివిధ ప్రాంతాల్లో చలామణి చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రెండు వేల రూపాయల నోట్లు మూడు వందలు (ఆరులక్షలు), కలర్ ప్రింటర్, ఏడు సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు…
సాయంలోనూ తగ్గేదేలే..
ఐకాన్ స్టార్ ఔదార్యం.. డ్రైవర్ ఇంటి నిర్మాణానికి రూ.15లక్షల సాయం కమలాపూర్ వాసి, డ్రైవర్ మహిపాల్ ఇంట విరిసిన ఆనందం వరంగల్ వాయిస్, హనుమకొండ: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. పాన్ ఇండియా లెవల్ లో తగ్గేదేలే.. అనే నటనతో ఉర్రూతలూగిస్తున్న విషయం తెలిసిందే. మెగా కంపౌండ్ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నటన, డాన్స్ , డైలాగ్ డెలివరీలో తనదైన మార్క్ చూపించుకుంటున్నాడు. సినిమా సినిమాకు తన కెరీర్ ను ఉన్నతంగా…
బావిలోకి దూసుకెళ్లిన కారు
ఇద్దరు అక్కడికక్కడే మృతి వరంగల్ వాయిస్, కేసముద్రం : దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న కారు శుక్రవారం రాత్రి ఆరున్నర గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు కేసముద్రం బైపాస్ రోడ్డు వెంట ఉన్న బావిలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు కారులోనే చిక్కుకున్నారు. ఇందులో చిన్నారి పాప కూడా ఉన్నట్లు తెలుస్తోంది. టేకుల గూడెంనుంచి అన్నారం షరీఫ్కు కారులో ఐదుగురు బయలు దేరారు. తిరిగి వచ్చే క్రమంలో హహబూబాబాద్కు చెందిన మరో ఇద్దరు వీరితో…
డోర్నకల్ యాదవుల్లో ముసలం
సోషల్ మీడియా వేదికగా పోస్టుల యుద్ధం వరంగల్ వాయిస్, డోర్నకల్: డోర్నకల్ యాదవ కులంలో ముసలం పుట్టింది. గొర్రెల పెంపకదారుల సహకార సంఘం కమిటీ ఇందుకు వేదికైంది. ఆ సంఘానికి మండల చైర్మన్ గా పనిచేసిన కేశబోయిన మల్లేశం పదవీ కాలం ముగిసిందని, ప్రస్తుతం కమిటీ బాధ్యతలు పశు వైద్యధికారి సురేష్ కు ఇవ్వడంతో తదుపరి ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు ఇన్ చార్జి చూస్తారని మాజీ ఎంపీటీసీ కొత్త రాంబాబు నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ…
క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ లో స్వయం పాలన దినోత్సవం
వరంగల్ వాయిస్, కాజీపేట : స్థానికి డీజిల్ కాలనీలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ లో శనివారం రోజున స్వయం పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో ఉ త్తమంగా బోధించిన పలువురు విద్యార్థులకు ప్రిన్సిపాల్ శీరీష బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ షరీఫ్, ప్రిన్సిపాల్ శీరిష, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అధికారులే అక్రమార్కులు – చేనేత దందాలో అందరూ వాటాదారులే..
లక్షల్లో జీఎస్టీ ఎగవేత నిద్ర మత్తులో చేనేత, జౌళి శాఖ పర్సంటేజీల వారీగా పంపకాలు ఆడిట్ రిపోర్టులపై అసిస్టెంట్ రిజిస్ట్రార్చే సంతకాలు ప్రభుత్వ ఖజానాకు భారీ గండి చర్యలు తీసుకోవాలని చేనేత కార్మికుల డిమాండ్ చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకోవాలన్న లక్ష్యంతో వివిధ కాంపొనెంటుల కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రవేశ పెట్టిన ఆర్ ఆర్ ఆర్ పథకం చేనేత, జౌళి శాఖ అధికారులకు కాసుల పంట పండించింది. కోట్ల రూపాయల…
256కిలోల గంజాయి స్వాధీనం
ముగ్గురు నిందితుల అరెస్ట్ వరంగల్ వాయిస్, క్రైం: ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు భారీ స్థాయిలో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు గంజాయి స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ , హసన్ పర్తి పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు 38 లక్షల రూపాయల విలువగల గంజాయితో పాటు గంజాయి తరలిస్తున్న కారును, ఒక మోటార్ సైకిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ కు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్…
నాకు మీరు రక్ష – మీకు నేను రక్ష
మనమంతా ఈ దేశానికి, ధర్మానికి రక్ష బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: ‘తోబుట్టువులు లేని నాకు మీ ప్రేమానురాగాలు ఆప్యాయతలు నన్ను కట్టిపడేశాయి..’ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి 11వ డివిజన్ పోతననగర్ కాలనీ మహిళలను కొనియాడారు. గురువారం ఆయనకు పలువురు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. మనసా వాచా అందరికీ అన్నలా అండగా ఉంటానన్నారు. రక్షా బంధన్ బంధానికి…
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్గా అల్లం నారాయణ
వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్గా అల్లం నారాయణ పదవి కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా అకాడమి శాశ్వత భవన నిర్మాణంతోపాటు జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్న ఉద్యమ కారుడు అల్లం నారాయణకు పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.