Crime
ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న కారు
ఇద్దరు యువకుల దుర్మరణం వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : వేగంతో వస్తూ అదుపు తప్పిన కారు.. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే దుర్మరణం చెందిన విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి గ్రామ శివారులో సోమవారం చోటు చేసుకుంది. గూడూరు మండలం పోనుగోడు గ్రామానికి చెందిన సంగెం మణికంఠ (17), నీల అరుణ్ కుమార్ (16) ప్రాణస్నేహితులు. మణికంఠ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జ్యోతి బా ఫూలే కళాశాలలో ఇంటర్ ద్వితీయ…
మెడలోని పుస్తెల తాడు అపహరణ
జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో ఘటన వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : ఓ మహిళ తన ఇంటి ముందు మనువడిని అడిస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగుడు ఆమె మెడలోంచి పుస్తెల తాడు, ఇతర బంగారు గొలుసును అపహరించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో చోటు చేసుకుంది. కృష్ణ కాలనీ చెందిన మంగళంపల్లి సోమలక్ష్మి తన మనువడిని ఇంటి ముందు ఆడిగిస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగుడు ఆమె మెడలోంచి నాలుగున్నర తులాల బంగారు…
వారెవ్వ.. తగ్గేదే లే పుష్ప.. పుష్పరాజ్
సినిమా లెవెలెల్లో గంజాయి స్మగ్లింగ్ గంజాయి స్మగ్లర్ అరెస్ట్ భారీగా పట్టుబడిన గంజాయి యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం పోలీసుల చొరవ రూ.85 లక్షల విలువ గల 338 కిలోల గంజాయి, ట్రాక్టర్ పోలీసులు స్వాధీనం పోలీస్ సిబ్బందిని ప్రశంసించిన సిపి అంబర్ కిషోర్ షా వరంగల్ వాయిస్, క్రైం : అల్లు అర్జున్ నటించిన పుష్ఫ సినిమా దేశవ్యాప్తంగా ఎంత హిట్ అయిందో మనందరికి తెలిసిందే.. అందులో ఎర్ర చెందనం చెక్కల అక్రమ రవాణా ఎలా…
నిమజ్జన వేళ ట్రాఫిక్ ఆంక్షలు
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వరంగల్ వాయిస్, హనుమకొండ : వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటి పరిధిలో వినాయక నిమజ్జనం సందర్బంగా నగరంలో శోభాయాత్ర నిర్వహించబడుతుంది. కాబట్టి నగరంలో పెద్ద స్థాయిలో నిమజ్జనానికి విగ్రహాలను తరలించే మార్గాల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ట్రై సిటి పరిధిలో వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా రేపు అనగా 16-09-2024 మధ్యాహ్నం 12.00 నుండి…
గోవర్ధనగిరిలో యువకుడి ఆత్మహత్య
వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో గల దర్గా సమీపంలో గురువారం ఉదయం యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం భూపాలపల్లి మండలం నేరేడుపల్లి గ్రామానికి చెందిన బర్ల హరీష్ (35)అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేవాన్ని జనగామ ఏరియా హాస్పిటల్ కు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.
వాహనం నడిపిన మైనర్లపై కేసు
జువైనల్ హోమ్ కు తరలింపు వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు నడిపిన 8 మంది మైనర్లను గుర్తించి శుక్రవారం జువైనల్ కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేయగా, వీరికి రెండు రోజులు బాలల అబ్జర్వేషన్ హోం కు పంపినట్లు మట్టేవాడ సీఐ కె.శ్రీధర్ తెలిపారు. పోచమ్మ మైదాన్, ఎంజీఎం సెంటర్, పోతన రోడ్డు, బట్టల బజార్, హెడ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్ లలో వాహనాలు నడుపుతున్న మైనర్ లను గుర్తించి…
అత్తను తుపాకీతో కాల్చిన అల్లుడు
అక్కడికక్కడే మృతి వరంగల్ వాయిస్, హనుమకొండ : నగరంలో గురువారం దారుణం చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కానిస్టేబుల్ ఆదప్రసాద్ గురువారం హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం ప్రాంతానికి చెందిన తన అత్త కోమలను సర్విస్ రివాల్వర్ తో కాల్చి చంపాడు. స్థానికులకు కథనం ప్రకారం.. ప్రసాద్ కు ఇవ్వవలసిన రూ.4 లక్షల విషయంలో గత కొంత కాలంగా అత్తా, అల్లుడి మధ్య వివాదం జరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం…
ప్లాష్..ప్లాష్.. వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ బదిలీ
వరంగల్ వాయిస్, హనుమకొండ : ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. రాష్ట్రంలో 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో బదిలీ అయిన 13మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్ పోలీసు అధికారులు ఉన్నారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు బదిలీ అయ్యారు. తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల్లోని నలుగురు డీఈఓలను…
బాలుడి హత్య కేసులో.. నిందితుడికి మరణ శిక్ష
మహబూబాబాద్ కోర్టు సంచలన తీర్పు మూడేళ్ల క్రితం ఘటన వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ లో మూడేళ్ల క్రితం తొమ్మిది సంవత్సరాల బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో నిందితుడు మంద సాగర్ కు మరణ శిక్ష విధిస్తూ శుక్రవారం జిల్లా కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. కోర్టు తీర్పుపై దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేయడంతోపాటు న్యాయ దేవత, పోలీసుల చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. వివరాల్లోకి వెళితే..మహబూబాబాద్ పట్టణంలోని…
పండుగలు మతసామరస్యానికి ప్రతీకలు
నూతన గణేష్ మండపాల సమాచారాన్ని ఇవ్వండి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ వరంగల్ వాయిస్, వరంగల్ : మన పండుగలు మతసామరస్యానికి ప్రతీకలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. రానున్న వినాయక చవితి, మిలాద్-ఉన్-నబి పండుగలను పురస్కరించుకొని సెంట్రల్ జోన్ పోలీసుల అధ్వర్యంలో శాంతి పరిరక్షణ కమిటీ సమావేశాన్ని ములుగు రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్స్ లో నిర్వహించారు. ట్రై సీటీ పరిధిలోని వివిధ మతాలకు చెందిన మత పెద్దలతో పాటు, గణేష్ నవరాత్రి…