Crime
బావిలోకి దూసుకెళ్లిన కారు
ఇద్దరు అక్కడికక్కడే మృతి వరంగల్ వాయిస్, కేసముద్రం : దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న కారు శుక్రవారం రాత్రి ఆరున్నర గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు కేసముద్రం బైపాస్ రోడ్డు వెంట ఉన్న బావిలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు కారులోనే చిక్కుకున్నారు. ఇందులో చిన్నారి పాప కూడా ఉన్నట్లు తెలుస్తోంది. టేకుల గూడెంనుంచి అన్నారం షరీఫ్కు కారులో ఐదుగురు బయలు దేరారు. తిరిగి వచ్చే క్రమంలో హహబూబాబాద్కు చెందిన మరో ఇద్దరు వీరితో…
256కిలోల గంజాయి స్వాధీనం
ముగ్గురు నిందితుల అరెస్ట్ వరంగల్ వాయిస్, క్రైం: ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు భారీ స్థాయిలో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు గంజాయి స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ , హసన్ పర్తి పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు 38 లక్షల రూపాయల విలువగల గంజాయితో పాటు గంజాయి తరలిస్తున్న కారును, ఒక మోటార్ సైకిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ కు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్…
‘న్యాయవాది’ హత్యకేసులో నిందితుల రిమాండ్
వరంగల్ వాయిస్, ములుగు: న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసులో నిందితులకు ఈనెల 18 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. మల్లారెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులను ములుగు పోలీసులు శనివారం ఇన్ చార్జి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మరో 11 మంది నిందితులు పరారీలో ఉన్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కోర్టు ముందు ఏ1 గోనెల రవీందర్, ఏ2 పిండి రవి యాదవ్, ఏ3 వంచ రామ్మోహన్ రెడ్డి,…
పోలీస్ వర్సెస్ బార్ ఓనర్స్
ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారిపై సీరియస్ ఆరుగురు యజమానులపై కేసులు చేయి చేసుకోవడంతో ముదిరిన వివాదం ఒక రోజు బంద్ పాటించి నిరసన ‘‘ప్రభుత్వానికి క్రమం తప్పకుండా లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్నాం.. అలాగే అధికారులకు, పోలీసులకు నెలవారి మామూళ్లు అందిస్తున్నాం.. అడిగినప్పుడల్లా లిక్క ర్ బాటిళ్లు సరఫరా చేస్తున్నాం.. ’’ ఇన్నీ చేస్తున్నా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కారంటూ పోలీసులు కేసు నమోదు చేయడంపై బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తే…
చికోటి ప్రవీణ్ కు మాకు ఎలాంటి సంబంధం లేదు
భవితశ్రీ మేనేజింగ్ డైరెక్టర్ తాటిపల్లి శ్రీనివాస్ వరంగల్ వాయిస్, హనుమకొండ: క్యాసినో చికోటి ప్రవీణ్ తో తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నామని అతడికి తమకు ఎలాంటి సంబంధం లేదని భవితశ్రీ మేనేజింగ్ డైరెక్టర్ తాటిపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బుధవారం హన్మకొండ అమృత థియేటర్ పరిధిలోని భవితశ్రీ చిట్ ఫండ్ బ్రాంచ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్యాసినో చికోటి ప్రవీణ్ కి తమకు ఎలాంటి సంబంధం లేదని తమ సంస్థతో ఎలాంటి…
నగరంలో శంకర్ దాదా ఎంబీబీఎస్
ఏ విద్యార్హత లేకున్నా వైద్యం నకిలీ డాక్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు వివరాలు వెల్లడించిన సీపీ డా. తరుణ్ జోషి వరంగల్ వాయిస్, క్రైం: వరంగల్ నగరంలో ఏలాంటి విద్యార్హత లేకుండానే వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్ తో పాటు అతడి సహాయకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన నకిలీ డాక్టర్ నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక లక్ష 90 వేల రూపాయల నగదుతో పాటు, ఒక ల్యాప్…
ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన వ్యక్తిపై పీడీయాక్ట్
వరంగల్ వాయిస్, క్రైం: ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన నిందితుడిపై వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పాటు ఉద్యోగాల పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగుల వద్ద డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న గుంటూరు జిల్లా పట్టాబిపురానికి చెందిన ఎస్.కె.గౌస్, పై వరంగల్ పోలీస్ కమిషనర్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను మీల్స్ కాలనీ ఇన్ స్పెక్టర్ ముస్కా శ్రీనివాస్ నిందితుడు…
అనుమానం.. రెండు ప్రాణాలు బలి
భార్యను నరికి చంపిన భర్త ఆపై పురుగుల మందు తాగి ఆత్మహత్య రెండు నెలల కిందటే వివాహం ఆత్మకూరు మండల కేంద్రంలో విషాదం వరంగల్ వాయిస్, ఆత్మకూరు: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఆత్మకూరు మండలంలో భార్యను హత్య చేసిన ఓ భర్త.. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన తాళ్ల హరీష్, తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గౌరీదేవిపేటకు చెందిన పుష్పలీలకు రెండు నెలల కిత్రం వివాహం జరిగింది. అయితే భార్యకు…
హాస్టల్ లో ఫైటింగ్
ముగ్గురు విద్యార్థినులకు గాయాలుకారణాలు బయటకు పొక్కనివ్వని సిబ్బందితల్లిదండ్రుల ఆందోళనతో ఆలస్యంగా వెలుగులోకి వరంగల్ వాయిస్, వరంగల్ టౌన్: నగరంలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ శంభునిపేటలో 9వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థునులకు గొంతుపై కోసినట్లు గాయాలు కావడం నగరంలో సంచలనం సృష్టించింది. ఈనెల 24న సంఘటన జరిగినా గురుకుల సిబ్బంది దీనిని గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. గురుకుల సిబ్బందే ట్రీట్మెంట్ ఇప్పించడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సోమవారం బాధిత విద్యార్థునుల తల్లిదండ్రులు గురుకులం…
తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవిత కాలం పెంచుదాం
వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి రెడ్ క్రాస్ లో పోలీసుల ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం వరంగల్ వాయిస్, క్రైం: యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవితకాలాన్ని పెంచాలని పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి యువతకు పిలుపునిచ్చారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాధితులకు కోసం హన్మకొండ రెడ్ క్రాస్ పిలుపునందుకోని హనుమకొండ డివిజినల్ పోలీసుల ఆధ్వర్యంలో సుబేదారిలోని రెడ్ క్రాస్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పోలీస్ కమిషనర్ డా….