Warangal
బస్టాండులో డ్రైవర్ నిర్లక్ష్యం
బస్సు ఢీకొనడంతో విద్యార్థి మృతి బస్సు అద్దాలు ధ్వంసం చేసిన తోటి విద్యార్థులు వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ బస్టాండ్ లో డ్రైవర్ నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణాన్ని బలితీసుకుంది. విద్యార్థిని బస్సు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మిగతా స్టూడెంట్స్ బస్టాండులోనే ఉన్న నాలుగు బస్సుల అద్వాలను ధ్వంసం చేశారు. వీరితో పాటు ప్రయాణికులు కూడా ఆందోళనకు దిగారు. తన స్నేహితుడిని బస్సు ఎక్కించడానికి చింతా అనిల్ అనే విద్యార్థి…
సెటిల్మెంట్లకు పాల్పడినట్లు నిరూపిస్తే, నేను ఉద్యోగం వదిలేసి పోతా
-వరంగల్ పోలీస్ కమిషనర్ పి.వి. రంగనాథ్ వరంగల్ వాయిస్, క్రైం: నేను సెటిల్ మెంట్లకు పాల్పడినట్లుగా నిరూపిస్తే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతానని యం.పి బండి సంజయ్ కుమార్ వ్యాక్యలకు కౌంటర్ ఇచ్చారు వరంగల్ పోలీస్ కమిషనర్, నిన్నటి రోజున మీడియా సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ పై బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాక్యల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నన్ను…
బిఆర్ఎస్ బెదరింపులకు భయపడేది లేదు
దాడులు చేస్తే రెట్టింపు స్థాయిలో ప్రశ్నిస్తాం వైఎస్ షర్మిల విమర్శలు వరంగల్ వాయిస్,వరంగల్: ప్రజల పక్షాన పోరాడటమే తప్పా….? అని వైఎస్ఆర్టీపీ చీప్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల బెదిరింపులకు, దాడులకు వైఎస్ షర్మిల భయపడదని స్పష్టం చేశారు. విూ దాడులకు రెట్టింపు స్థాయిలో విూ అవినీతిని ప్రశ్నిస్తామని తేల్చి చెప్పారు. నిన్న జరిగిన దాడిపై పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న షర్మిల…విూలాంటి జేజమ్మలని ఎంతో మందిని చూశానన్నారు. మరోసారి చెప్తున్నా బీఆర్ఎస్ నాయకులు…
వరలక్ష్మీ నమోస్తుతే..
భక్తిశ్రద్ధలతో వ్రతాలు మహిళలతో కిటకిటలాడిన ఆలయాలు వరంగల్ వాయిస్, కాశిబుగ్గ: నగరంలోని 19వ డివిజన్ లో శుక్రవారం మహిళలు వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించారు. ఓ సిటీలోని కోయిల్ కార్ కావ్య ఇంట్లో వరలక్ష్మీ వ్రతం భక్తిశ్రద్ధలతో జరిపారు. అలాగే పలు ఆలయాల్లో సంతోషిమాత వ్రతాల కోసం మహిళలు భారీగా తరలివచ్చి అమ్మవారిని కొలిచారు. శాయంపేటలో.. శాయంపేట మండల కేంద్రంలోని చారిత్రాత్మకమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో వరలక్ష్మి వ్రతాన్ని దేవాలయ అర్చకుడు ఆరుట్ల కృష్ణమాచారి ఘనంగా నిర్వహించారు….
నరేందర్ సైలెంట్ కాదు.. వైలెంట్
కార్యకర్తలకు అన్యాయం జరిగితే తిరగబడుతాం.. త్వరలో నియోజకవర్గ పర్యటన ఇది నా బర్త్ డే డిక్లరేషన్ నరేందర్ సైలెంట్గా ఉన్నాడు..ఎవరు ఏమన్నా పట్టించుకోడు అనుకుంటున్నారేమో.. నరేందర్ సైలెంట్ కాదు..వైలెంట్.. పార్టీని చీల్చుతామంటూ కొందరు చెప్పుకొంటున్నారు..పార్టీని కాదు నిన్నే చీల్చుతాం..చీల్చింది ఎలా అంటే నీవు పుట్టిన ఊరి వరకు వినిపించేలా ఉంటుందంటూ ఇటీవల పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన ఓ నేతనుద్దేశించి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఘాటుగా స్పందించారు. ఇది తన బర్త్ డే డిక్లరేషన్ అంటూ…
పోలీస్ వర్సెస్ బార్ ఓనర్స్
ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారిపై సీరియస్ ఆరుగురు యజమానులపై కేసులు చేయి చేసుకోవడంతో ముదిరిన వివాదం ఒక రోజు బంద్ పాటించి నిరసన ‘‘ప్రభుత్వానికి క్రమం తప్పకుండా లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్నాం.. అలాగే అధికారులకు, పోలీసులకు నెలవారి మామూళ్లు అందిస్తున్నాం.. అడిగినప్పుడల్లా లిక్క ర్ బాటిళ్లు సరఫరా చేస్తున్నాం.. ’’ ఇన్నీ చేస్తున్నా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కారంటూ పోలీసులు కేసు నమోదు చేయడంపై బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తే…
నగరంలో శంకర్ దాదా ఎంబీబీఎస్
ఏ విద్యార్హత లేకున్నా వైద్యం నకిలీ డాక్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు వివరాలు వెల్లడించిన సీపీ డా. తరుణ్ జోషి వరంగల్ వాయిస్, క్రైం: వరంగల్ నగరంలో ఏలాంటి విద్యార్హత లేకుండానే వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్ తో పాటు అతడి సహాయకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన నకిలీ డాక్టర్ నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక లక్ష 90 వేల రూపాయల నగదుతో పాటు, ఒక ల్యాప్…
అనుమానం.. రెండు ప్రాణాలు బలి
భార్యను నరికి చంపిన భర్త ఆపై పురుగుల మందు తాగి ఆత్మహత్య రెండు నెలల కిందటే వివాహం ఆత్మకూరు మండల కేంద్రంలో విషాదం వరంగల్ వాయిస్, ఆత్మకూరు: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఆత్మకూరు మండలంలో భార్యను హత్య చేసిన ఓ భర్త.. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన తాళ్ల హరీష్, తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గౌరీదేవిపేటకు చెందిన పుష్పలీలకు రెండు నెలల కిత్రం వివాహం జరిగింది. అయితే భార్యకు…
లీడర్ బన్ గయా ఆటోవాలా..
ఉమ్మడి జిల్లాలో ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. నేతలు, లీడర్లు అంతా ఆటో కార్మికులను కలిసి శుభాకాంక్షలు తెలుపడంతో పాటు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, వరంగల్ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, బీజేపీ నేత రాకేష్ రెడ్డి తదితరులు ఆటో నడిపి ఆటో కార్మికులను ఉత్సాహపరిచారు. -వరంగల్ వాయిస్,…
చాయ్ వాలాకు సత్కారం
వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : ఎంజీఎం రెండో గేటు ముందు గత 20 సంవత్సరాలుగా టీ కొట్టు నడిపిస్తూ వీధి వ్యాపారం నిర్వహణలో మొదటి స్థానం దక్కించుకున్న మహమ్మద్ మహబూబ్ పాషాని వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ.రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగాలకోసం కాకుండా స్వయం కృషితో అభివృద్ది చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ శ్రవణ్, సాయి, శైలజ, శ్రీకాంత్ హోటల్…