Warangal
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ
వరంగల్ వాయిస్, హనుమకొండ : నగరంలో ఇటీవల మరణించిన పలు బాధిత కుటుంబాలను గురువారం తెలంగాణ తొలి శాసనసభాపతి, ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పరామర్శించారు. ప్రకాశరెడ్డిపేటలో గాదె పాపిరెడ్డి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పోస్టల్ కాలనీలో సూరవు దయాకర్ రావు ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిరికొండ మధుసూదనాచారి వెంట 50వ డివిజన్ కార్పొరేటర్ నెక్కొండ కవిత కిషన్, కార్యకర్తలు ఉన్నారు.
కేంద్రం కేటాయించిన నిధులపై ఆర్టీఐ దరఖాస్తు
వరంగల్ వాయిస్, వర్ధన్నపేట : భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట అధ్యక్షుడు రాయపురపు కుమారస్వామి ఆధ్వర్యంలో స్థానిక మండల అభివృద్ధి అధికారి రాజ్యలక్ష్మి, మండల పంచాయతీ అధికారి ధనలక్ష్మి కిసమాచార హక్కు చట్టం ద్వారా మండల పరిషత్, మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల కేటాయింపు వినియోగానికి సంబంధించిన సమాచారం కోసం దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పక్షాన…
వీఆర్ఏల సమ్మెకు బీజేపీ మద్దతు
వరంగల్ వాయిస్, కాజీపేట : స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలతో వీఆర్ఏల జాక్ తో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వీఆర్ఏలకు సంఘీభావం తెలిపారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. పే స్కేల్ ప్రమోషన్లు కల్పిస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారని దుయ్యపట్టారు. సమ్మెలో పాల్గొన్న బీజేపీ నాయకులు హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు చిల్లర నర్సింగ్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి ఎండీ చాంద్ పాషా, 2వ డివిజన్…
స్మార్ట్ బస్ షెల్టర్లు.. ఉత్తముచ్చటేనా?
నగరంలో 121 ఏర్పాటుకు ప్రతిపాదనలు నేటికీ ముందుకు పడని అడుగులు ఇబ్బందులో ప్రజలు మొద్దునిద్రలో బల్దియా అధికారులు రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరాన్ని హైదరాబాద్కు ఏమాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చేస్తున్నట్లు పాలకులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రకటనలు నీటి మూటలుగా మారుతున్నాయి. అధికారుల అలసత్వం, పాలకులు పట్టింపులేని తనంతో నగరం మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి వెళ్తోంది. నగరంలో నూతనంగా చేపట్టాల్సిన ఎన్నో పథకాలు కేవలం కాగితాలకే…
సంతకమే ఆమెది.. పెత్తనమంతా ఆయనదే
గ్రేటర్లో సగానికిపైగా మహిళా ప్రతినిధులే వీరిలో చాలా మంది వంటింటికే పరిమితం రాజకీయంగా చక్రం తిప్పుతున్న పతులు అధికారిక కార్యక్రమాల్లోనూ వారే ప్రకటనల్లోనూ భార్య పేరు పక్కనే భర్త పేరు అయోమయానికి గురవుతున్న జనం మహిళా సాధికారత కేవలం కాగితాలకే పరిమితమైంది. స్థానిక సంస్థల్లో 50 శాతానికి పైగా మహిళలే ఉన్నప్పటికీ చక్రం తిప్పేది మాత్రం పురుషులే. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న రాజకీయ రిజర్వేషన్లు మహిళల జీవితాల్లో మార్పు తేవడం లేదు. చట్టసభల్లోనూ వారు భర్తల…
వీఆర్ఏలు సమస్యలు పరిష్కరించండి
వరంగల్ వాయిస్, నర్సంపేట : వీఆర్ఏ రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు వీఆర్ఏల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరి కి నిరసనగా తహసీల్దార్ కార్యాలయంలో 2వ రోజు సమ్మె కొనసాగుతుంది. ఈ సమ్మెకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల వీఆర్వో సంఘం సంఘీభావం తెలుపారు. సమ్మెను ఉద్దెశించి వీఆర్ఏలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, కౌన్సిలర్ వేముల సాంబయ్య మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యలు న్యాయమైనవి, వారికి పే స్కేల్ జీవో వెంటనే…
గొర్రెల, మేకల అనారోగ్య నివారణకు వ్యాక్సిన్
వరంగల్ వాయిస్, వరంగల్ : గొర్రెలు, మేకలు అనారోగ్య నివారణకు, నీలి నాలుక వ్యాధిని అరికట్టేందుకు ముందు జాగ్రత్తగా బ్లుటంగ్ వాక్సిన్ రాష్ట్ర ప్రభుత్వం వేయించడం జరుగుతుందని, దీన్ని గొర్రెలు, మేకల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. పశు వైద్యశాల డాక్టర్ ఝాన్సీ అధ్వర్యంలో శుక్రవారం ఉచిత మందుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు మందులను పంపిణీ చేసి, గొర్రెలకు ఇంజక్షన్లు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన…