Warangal
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా
ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వరంగల్ వాయిస్, కరీమాబాద్ : ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్బంగా తెలంగాణ ఆటో, ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ, జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం జెండా ఆవిష్కరించి ఆటో డ్రైవర్లనుద్దేశించి మాట్లాడారు. ఉద్యమనేత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అన్ని…
రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ అధ్యక్షుడిగా అశోక్బాబు
నూతన కమిటీ ప్రమాణ స్వీకారం వరంగల్ వాయిస్, ఖిలా వరంగల్ : రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సం సోమవారం కాశిబుగ్గలోని వేడుకల మందిరంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ శరత్ బాబు నూతన కమిటీచే ప్రమాణస్వీకారం చేయించారు. క్లబ్ ప్రెసిడెంట్గా బేతి అశోక్ బాబు, సెక్రటరీగా భేతి సతీష్, కోశాధికారిగా ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఈ సందర్భంగా నూతన…
రహదారి మరమ్మతులు చేయండి
హైదరాబాద్లో రోడ్లు, భవనాల చీఫ్ ఇంజనీర్కు గంట రవికుమార్ వినతి వరంగల్ వాయిస్, వరంగల్ : గుంతలు పడి, ఇనుప చువ్వలు తేలి ప్రమాదకరంగా మారిన వరంగల్ బట్టల బజార్ రైల్వే ఓవర్ బ్రిడ్జితో పాటు ఇతర ఆర్ అండ్ బీ రహదారుల మరమ్మతులు చేపట్టాలని బీజేపీ నేత గంట రవికుమార్ కోరారు. ఈ మేరకు హైదరాబాద్లో సోమవారం ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ (రోడ్స్ అండ్ సీ ఆర్ ఎన్) పి.రవీందర్ రావు, ఆర్…
కాస్ట్ లీ బైక్ కనబడితే దోచేస్తారు..
ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్ రూ.13లక్షల విలువ చేసే బైక్ ల స్వాధీనం వివరాలు వెల్లడించిన తరుణ్ జోషి వరంగల్ వాయిస్, క్రైం: అత్యంత ఖరీదైన ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగలను శనివారం హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు 13 లక్షల విలువ గల ఎనిమిది ఖరీదైన ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్…
నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేపట్టాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వరంగల్ వాయిస్, క్రైం: నేరస్థులకు పట్టుకోనేందుకుగాను పోలీస్ అధికారులు నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అధికారులకు సూచించారు. ఆర్థ సంవత్సర నేర సమీక్షా సమావేశంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని శనివారం వరంగల్ కాకతీయ విశ్వ విద్యాలయంలోని సెనేట్ సమావేశ ప్రాంగణంలో నిర్వహించారు. ముందుగా పోలీసు కమిషనర్ ముందుగా డ్రైవ్ కేసులు, ప్రాపర్టీ నేరాలు, ఎస్సీ,…
తన భూమి.. ధరణిలో వేరొకరి పేరుతో..
ఆవేదనతో అనారోగ్యం బారిన పడి వ్యక్తి మృతి వరంగల్ వాయిస్, ఆరెపల్లి: తన భూమి ధరణి సైట్ లో మరొకరిపై పేరు రావడంతో ఆవేదనతో అనారోగ్యం బారిన పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. వరంగల్ జిల్లాలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన పొగాకు మహేందర్ గౌడ్ గ్రామ గౌడ కుల పెద్దమనిషి. తనకు వారసత్వంగా వచ్చిన సర్వే నెం 565 లో 0.17 గుంటల భూమి ధరణిలో అదే గ్రామానికి చెందిన ఇతరుల పేరుపై రావడంతో గత సంవత్సరం…
హద్దు మీరొద్దు
పార్టీ క్యాడర్కు ఎమ్మెల్యే చల్లా హెచ్చరిక విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న వారిపై సీరియస్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురిపై చర్యలు జవాబుదారితనంగా వ్యవహరించాలంటూ హితవు పరకాలలో తిరిగి గులాబీ జెండా ఎగురేసేందుకు కృషి చేయాలి వరంగల్ వాయిస్, పరకాల: పార్టీలో పట్టపగ్గాలు లేకుండా వ్యవహరిస్తున్న వారిపై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కొరఢా ఝులిపించినట్లు సమాచారం. నియోజకవర్గ పరిధిలో రాసలీలలు, డబుల్ బెడ్ రూం, దళిత బంధు పథకాల్లో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ప్రజా ప్రతినిధులు, ఇద్దరు…
బాధితుడికి ఆర్థిక సాయం అందజేత
వరంగల్ వాయిస్, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గౌడ్ ఐఏఎస్ సహకారంతో గురువారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో దొంతూరి సమ్మయ్య గౌడ్, ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామంలో బాల్నే రాజు గౌడ్ ఇటీవల గీత వృత్తి చేసుకుంటూ ప్రమాదవశాత్తు తాడి చెట్టుపై నుంచి పడి నడుము విరగగా అతడి వైద్య ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.15000 చెక్కులను బుర్రా వెంకటేష్ గౌడ్ పంపించారు. హనుమకొండ…
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల
ఈ పార్లమెంట్ సమావేశంలో బీసీల కుల గణన చేపట్టాలి బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించండి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ వరంగల్ వాయిస్, హనుమకొండ : బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో బీఎంఎస్ కార్యాలయంలో బీసీల చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్…
కంచాలు అందజేత
వరంగల్ వాయిస్, వరంగల్ : శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ ఎర్రం పూర్ణశాంతి గుప్తా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైద్రాబాద్ జిల్లాలో మసాబ్ టాంక్, బంజారాహిల్స్ బాలబడి చిన్నారులకు స్టీల్ కంచాలు, గ్లాసులను శ్రీ మామిడి భీం రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి దాతలు కరుణ, సుజాత, శారద, వనజ, పద్మ సహకరించారు. విజయ్, జేవీర్ సింగ్, నిర్మల,అనురాధ,విజయ,లక్ష్మి పాల్గొన్నారు.