District News
పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి
వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలో మంద కృష్ణ మాదిగపిలుపు మేరకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా 8వ రోజు రిలే నిరాహారదీక్షలో ఎంఎస్పీ మహబూబాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ గుగ్గిళ్ల పీరయ్య మాదిగ పాల్గొన్నారు. దీక్ష లో ఎంఎస్పీ నియోజకవర్గ ఇంఛార్జి పాషా, మండల ఇంఛార్జి కందిపాటి భిక్షపతి, వీహెచ్ పీఎస్ జిల్లా నాయకులు చలగొల వెంకన్న, మోలుగురి…
వీఆర్ఏల సమ్మెకు బీజేపీ మద్దతు
వరంగల్ వాయిస్, కాజీపేట : స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలతో వీఆర్ఏల జాక్ తో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వీఆర్ఏలకు సంఘీభావం తెలిపారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. పే స్కేల్ ప్రమోషన్లు కల్పిస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారని దుయ్యపట్టారు. సమ్మెలో పాల్గొన్న బీజేపీ నాయకులు హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు చిల్లర నర్సింగ్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి ఎండీ చాంద్ పాషా, 2వ డివిజన్…
వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి
వరంగల్ వాయిస్, పరకాల : తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ డిమాండ్ చేశారు. పట్టణ కేంద్రంలో వీఆర్ఏలు చేపట్టిన దీక్షకు వారు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలను పట్టించుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన పే స్కేల్ జీవో వెంటనే విడుదల చేయాలి అన్నారు. అర్హులైన వారికి ప్రమోషన్ ఇవ్వాలన్నారు. అలాగే మిగతా వారి…
‘సంగ్రామ’ భేరి.. గెలుపుపై గురి
ఓరుగల్లుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యం ఆగస్టు 2నుంచి బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధినుంచి ప్రారంభం 26న వరంగల్లో భారీ ముగింపు సభ హాజరుకానున్న బీజేపీ చీఫ్ నడ్డా ఓరుగల్లుపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న మూడో విడత పాదయాత్రను మొదట వరంగల్ భద్రకాళి అమ్మవారి సన్నిధినుంచే…
ముగ్గురు గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్
క్రయవిక్రయాలు జరిపిన వారిపై కఠిన చర్యలు యువతకు మత్తు వ్యసనాలకు బానిస కావొద్దు వరంగల్ సీపీ డా. తరుణ్ జోషి వరంగల్ వాయిస్, పరకాల: పరకాల పోలీస్ స్టేషన్ పరధిలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముగ్గురిపై వరంగల్ పోలీస్ కమిషనర్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ములుగు జిల్లా వెంకటపురం మండలం లక్ష్మీ దేవి పేట్ చెందిన కమ్మగాని రాంమూర్తి, కమ్మగాని చందుతో పాటు జయశంకర్ భూపాల్ పల్లి…
నేటినుంచి శ్రావణమాసం ఆరంభం
వ్రతాలు, నోములకు పెద్దపీటవరంగల్ వాయిస్, జూలై28 : తెలుగు మాసాల్లో ఐదో మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసం వర్షఋతువులో వస్తుంది.. కనుక విరివిగా వర్షాలు కురుస్తాయి. ఈ నెల హిందువుల లోగిళ్ళు ఆలయాలను తలపిస్తాయి. విష్ణువు, లక్ష్మీదేవులకు అత్యంత ఇష్టమైన మాసం శ్రావణ మాసం.. ఈ నెలలో మహిళలు వ్రతాలు, నోములు, పూజలను ఆచరిస్తారు. ఈ నెలలలో ఆచరించే పూజల వలన విశేష ఫలితాలు లభిస్తాయని పెద్దల చెబుతారు. పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో…
స్మార్ట్ బస్ షెల్టర్లు.. ఉత్తముచ్చటేనా?
నగరంలో 121 ఏర్పాటుకు ప్రతిపాదనలు నేటికీ ముందుకు పడని అడుగులు ఇబ్బందులో ప్రజలు మొద్దునిద్రలో బల్దియా అధికారులు రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరాన్ని హైదరాబాద్కు ఏమాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చేస్తున్నట్లు పాలకులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రకటనలు నీటి మూటలుగా మారుతున్నాయి. అధికారుల అలసత్వం, పాలకులు పట్టింపులేని తనంతో నగరం మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి వెళ్తోంది. నగరంలో నూతనంగా చేపట్టాల్సిన ఎన్నో పథకాలు కేవలం కాగితాలకే…
75 ఏండ్ల స్వాతంత్ర భారతం.. దక్కని స్వాతంత్య్ర ఫలం
దుర్విచక్షణ, అసమానతలను అధిగమించి దేశీయంగా ప్రగతి సాధించబడాలనేది రాజ్యాంగ నిర్మాతల అభిమతం. కానీ స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు అవుతున్నా అది అందని ద్రాక్షగా మిగిలిపోయింది. భారతీయుల సగటు ఆయుర్ధాయాన్ని నేటికీ కూడా కులమే నిర్దేశిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం వెలువరించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అధ్యయనం అగ్రవర్ణాలతో పోలిస్తే.. ఎస్సీ, ఎస్టీల జీవిత కాలంలో నాలుగు నుంచి ఆరేండ్లు తగ్గుదలగా ఉన్నట్లుగా చెబుతున్నది. ఆయా సామాజిక వర్గాల సగటు ఆయుఃప్రమాణంతో 20 ఏండ్ల క్రితం 4.6…
కాంగ్రెస్ సత్యాగ్రహ..
సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ విచారణపై ఆగ్రహం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణుల దీక్షలు అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ హనుమకొండలో ‘నాయిని’ ఆధ్వర్యంలో నిరసన వరంగల్ వాయిస్, హనుమకొండ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఈడీ అక్రమ నోటీసులు జారీ చేయడాన్ని, రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు బుధవారం కాంగ్రెస్ పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా…
చెట్టు కింద పాలన.. ప్రజలతో మంత్రి ఎర్రబెల్లి మాటా మంతీ!
సింగరాజుపల్లిని మండల కేంద్రం చేయాలని వినతిపరిశీలిస్తామని హామీ వరంగల్ వాయిస్, జనగామ: నిత్యం జనంలోనే, జనంతోనే ఉండే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తన స్థాయి, స్థానం కోసం ఏనాడూ చూడరు. జనంతో ఉండటమే ముఖ్యమనుకుంటారు. అలా… అనేక సందర్భాల్లో ప్రవర్తించిన మంత్రి మరోసారి తన రూటే సెపరేటని నిరూపించారు. బుధవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలామ్ విగ్రహావిష్కరణకు వెళ్తూ జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం కుందారం (పటేల్ గూడెం)…