District News
సీఎం సహాయనిధి చెక్కు అందజేత
వరంగల్ వాయిస్, హనుమకొండ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఇందిరా నగర్ ప్రాంతానికి చెందిన శీలం ప్రవీణ్ అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉన్న విషయం స్థానిక నాయకులు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన ప్రభుత్వ చీఫ్ విప్ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సీఎం సహాయ నిధి నుంచి రూ. లక్ష మంజూరు చేయించి…
మెట్టుగుట్టపై ప్రత్యేక పూజలు
వరంగల్ వాయిస్, కాజీపేట : మడికొండలోని చారిత్రక మెట్టుగుట్టపై దక్షిణ కాశీ, హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి క్షేత్రములలో పునర్వసు నక్షత్రం(శ్రీరాముని జన్మనక్షత్రం) సందర్భంగా గురువారం అర్చకులు పరాశరం విష్ణు వర్ధనాచార్యులు శ్రీ స్వామి వారికి పంచామృతాభిషేకం నిర్వహించి, విశేషంగా అలంకరించి తదుపరి భక్తులకు దర్శనం కల్పించారు. యాగశాలలో శ్రీ రామ మూలమంత్ర హోమం నిర్వహించారు. తదుపరి శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ…
బీసీల చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించిన చీఫ్ విప్
ఆగస్టు 7న బీసీ మహాసభను విజయవంతం చెయ్యండిచీఫ్ విప్ వినయ్ భాస్కర్వరంగల్ వాయిస్, హనుమకొండ :ఆగస్టు 7న ఢిల్లీలో జరగబోయే బీసీ మహాసభను విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. గురువారం బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో ఆగస్టు 7న ఢిల్లీలో జరిగే బీసీల మహాసభ పోస్టర్ ను బాలసముద్రం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ దగ్గర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్…
ఘనంగా గుండు సుధారాణి పుట్టినరోజు వేడుకలు
వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : వరంగల్ తూర్పు కాశిబుగ్గ చౌరస్తాలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు ఆకెన వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ నాయకుడు యూత్ గుండు విజయరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భముగా ఆకెన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని, రాజకీయ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. గుండు విజయరాజ్ తో కేకు కట్ చేసి,…
బాధితుడికి ఆర్థిక సాయం అందజేత
వరంగల్ వాయిస్, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గౌడ్ ఐఏఎస్ సహకారంతో గురువారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో దొంతూరి సమ్మయ్య గౌడ్, ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామంలో బాల్నే రాజు గౌడ్ ఇటీవల గీత వృత్తి చేసుకుంటూ ప్రమాదవశాత్తు తాడి చెట్టుపై నుంచి పడి నడుము విరగగా అతడి వైద్య ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.15000 చెక్కులను బుర్రా వెంకటేష్ గౌడ్ పంపించారు. హనుమకొండ…
గిరిజన విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి
వైఎస్ఆర్ టీపీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్వరంగల్ వాయిస్, భూపాలపల్లి : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంక్షేమ శాఖ ఆశ్రమ ఉన్నత బాలికల హాస్టల్, జిల్లా ఎస్ఎంహెచ్ హాస్టల్లో ఉన్న సమస్యల పై గురువారం హాస్టల్ ను వైఎస్ఆర్ టీపీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ సందర్శించారు. అనంతరం హాస్టల్లోని విద్యార్థులు అక్కడ జరుగుతున్న ఇబ్బందులను ఆయనకు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన పూర్తి స్థాయి మెనూ విధానాన్ని అమలు చేయడం లేదని, నాసిరకంగా…
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ పోస్టర్ విడుదల
ఈ పార్లమెంట్ సమావేశంలో బీసీల కుల గణన చేపట్టాలి బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించండి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ వరంగల్ వాయిస్, హనుమకొండ : బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో బీఎంఎస్ కార్యాలయంలో బీసీల చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్…
ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం
వరంగల్ వాయిస్, చిట్యాల : మండలంలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జుకల్ గ్రామంలో అధికారులతో కలిసి జడ్పీటీసీ గొర్రె సాగర్, మండల స్పెషల్ ఆఫీసర్ శైలజ ఎస్ఆర్ఎస్పీ కాలువ ఇరుపక్కలా మొక్కలు నాటారు. అనంతరం మన ఊరు మన బడి కార్యక్రమంలో కొత్తగా నిర్మింస్తున్న భవనాలను పరిశీలించారు. వారి వెంట పంచాయతీరాజ్ ఏఈ రవికుమార్, గ్రామ సర్పంచ్ పుట్టపాక మహేందర్, ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, జగదీష్, పంచాయతీ కార్యదర్శి దేవేందర్ రెడ్డి, టి.అపర్ణ, చిరంజీవి, గ్రామ…
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ
వరంగల్ వాయిస్, హనుమకొండ : నగరంలో ఇటీవల మరణించిన పలు బాధిత కుటుంబాలను గురువారం తెలంగాణ తొలి శాసనసభాపతి, ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పరామర్శించారు. ప్రకాశరెడ్డిపేటలో గాదె పాపిరెడ్డి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పోస్టల్ కాలనీలో సూరవు దయాకర్ రావు ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిరికొండ మధుసూదనాచారి వెంట 50వ డివిజన్ కార్పొరేటర్ నెక్కొండ కవిత కిషన్, కార్యకర్తలు ఉన్నారు.
కేంద్రం కేటాయించిన నిధులపై ఆర్టీఐ దరఖాస్తు
వరంగల్ వాయిస్, వర్ధన్నపేట : భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట అధ్యక్షుడు రాయపురపు కుమారస్వామి ఆధ్వర్యంలో స్థానిక మండల అభివృద్ధి అధికారి రాజ్యలక్ష్మి, మండల పంచాయతీ అధికారి ధనలక్ష్మి కిసమాచార హక్కు చట్టం ద్వారా మండల పరిషత్, మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల కేటాయింపు వినియోగానికి సంబంధించిన సమాచారం కోసం దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పక్షాన…