Crime
లాయర్ దారుణ హత్య
వరంగల్ వాయిస్, ములుగు : ములుగు జిల్లాలో సోమవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో లాయర్ను దారుణంగా హత్య చేశారు. ములుగు జిల్లా కేంద్రానికి 11 కిలోమీటర్ల దూరంలోని పందికుంట బస్టాఫ్ వద్ద ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. హత్యకు గురైన వ్యక్తి న్యాయవాది మల్లారెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఎర్ర మట్టి క్వారీ.…భూ తగాదాలు.. పాత కక్షలే కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాస్ట్ లీ బైక్ కనబడితే దోచేస్తారు..
ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్ రూ.13లక్షల విలువ చేసే బైక్ ల స్వాధీనం వివరాలు వెల్లడించిన తరుణ్ జోషి వరంగల్ వాయిస్, క్రైం: అత్యంత ఖరీదైన ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగలను శనివారం హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు 13 లక్షల విలువ గల ఎనిమిది ఖరీదైన ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్…
నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేపట్టాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వరంగల్ వాయిస్, క్రైం: నేరస్థులకు పట్టుకోనేందుకుగాను పోలీస్ అధికారులు నైపుణ్యంతో కూడిన దర్యాప్తు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అధికారులకు సూచించారు. ఆర్థ సంవత్సర నేర సమీక్షా సమావేశంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని శనివారం వరంగల్ కాకతీయ విశ్వ విద్యాలయంలోని సెనేట్ సమావేశ ప్రాంగణంలో నిర్వహించారు. ముందుగా పోలీసు కమిషనర్ ముందుగా డ్రైవ్ కేసులు, ప్రాపర్టీ నేరాలు, ఎస్సీ,…
తన భూమి.. ధరణిలో వేరొకరి పేరుతో..
ఆవేదనతో అనారోగ్యం బారిన పడి వ్యక్తి మృతి వరంగల్ వాయిస్, ఆరెపల్లి: తన భూమి ధరణి సైట్ లో మరొకరిపై పేరు రావడంతో ఆవేదనతో అనారోగ్యం బారిన పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. వరంగల్ జిల్లాలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన పొగాకు మహేందర్ గౌడ్ గ్రామ గౌడ కుల పెద్దమనిషి. తనకు వారసత్వంగా వచ్చిన సర్వే నెం 565 లో 0.17 గుంటల భూమి ధరణిలో అదే గ్రామానికి చెందిన ఇతరుల పేరుపై రావడంతో గత సంవత్సరం…
అపరిచితులతో సమాచారం పంచుకోవద్దు..
బ్యాంకుల్లోని డబ్బులు దోచేస్తారు.. వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి విష్ణుప్రియ గార్డెన్స్ లో విద్యార్థులకు అవగాహన సదస్సు వరంగల్ వాయిస్, క్రైం: వివిధ సామాజిక మాద్యమాల్లో పరిచయమయ్యే అపరిచత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారన్ని పంచుకోవద్దని యువతకు వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి దిశా నిర్దేశం చేశారు. హనుమకొండ డివిజినల్ పోలీసుల అధ్వర్యంలో సైబర్ క్రైమ్స్, రోడ్డు సేఫ్టీ , మత్తు పదార్థాలపై కళాశాల విధ్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక…
ముగ్గురు గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్
క్రయవిక్రయాలు జరిపిన వారిపై కఠిన చర్యలు యువతకు మత్తు వ్యసనాలకు బానిస కావొద్దు వరంగల్ సీపీ డా. తరుణ్ జోషి వరంగల్ వాయిస్, పరకాల: పరకాల పోలీస్ స్టేషన్ పరధిలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముగ్గురిపై వరంగల్ పోలీస్ కమిషనర్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ములుగు జిల్లా వెంకటపురం మండలం లక్ష్మీ దేవి పేట్ చెందిన కమ్మగాని రాంమూర్తి, కమ్మగాని చందుతో పాటు జయశంకర్ భూపాల్ పల్లి…
బైక్ కవర్లో పైసలు మాయం
షాపులోకి వెళ్లొచ్చేసరికి అపహరించిన దుండగులు రూ.4లక్షలు చోరీ చేశారంటున్న బాధితుడు స్టేషన్ లో ఫిర్యాదు.. పోలీసుల విచారణ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన వరంగల్ వాయిస్, మహబూబాబాద్: ఓ రైతు బ్యాంకు ఖాతా నుంచి డ్రా చేసుకొని నగదును తన ద్విచక్ర వాహనంలోని ట్యాoకు కవర్ లో పెట్టుకొని బయలుదేరి మార్గ మధ్యలో ఓ షోరూమ్ ఎదుట పార్కింగ్ చేసి లోపలికి వెళ్లి బయటకు వచ్చే సరికే దుండగులు 4 లక్షల రూపాయలు చోరీ చేసిన సంఘటన…
బార్ అండ్ రెస్టారెంట్లపై ఎక్సైజ్ దాడులు
వరంగల్ వాయిస్, క్రైం: ఎక్సైజ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్ లపై టాస్క్ ఫోర్స్ టీం బుధవారం దాడులు చేసింది. నిబంధనలు పాటించకుండా ఉదయాన్నే బార్లు తెరుస్తున్నారని మట్వాడ, హన్మకొండ, కేయూసీ, మిల్స్ కాలనీ, సుబేదారి, ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని బార్ అండ్ రెస్టారెంట్లను తనిఖీ చేశారు. ఆరుగురు బార్ నిర్వాహకులు, ఒక కార్మికుడిని అరెస్ట్ చేసి మద్యాన్ని సీజ్ చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. దాడులు చేసిన బార్ అండ్ రెస్టారెంట్లలో…
అనుమానంతో .. అంతమొందించాడు
భార్యను హత్య చేసిన భర్త నిందితుడి ఇంటికి నిప్పుపెట్టిన బంధువులు మరిపెడ మండలం అనకట్ట తండాలో విషాదం వరంగల్, వాయిస్, డోర్నకల్: ‘‘అమ్మ… లే అమ్మ… నాన్న వెళ్లిపోయా డు… లేవమ్మా’’ అంటూ చనిపోయిన వాళ్ల అమ్మను లేపే ప్రయత్నం చేస్తున్న చిన్నారులను వారించ టం.. సముదాయిం చటం ఎవ్వరి వల్ల కాలేదు. తండ్రి అవేశం వల్ల తమ తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తెలియని చిన్నారుల పరిస్థితి చూసి తండావాసులు కన్నీరుపె ట్టారు. మానుకోట జిల్లాలో…
ముగ్గురు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్
వరంగల్ వాయిస్, ములుగు: ముగ్గురు మావోయిస్టు కొరియర్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం వారి అరెస్ట్ ను చూపిన వెంకటాపురం సీఐ కె. శివప్రసాద్ మంగళవారం వివరాలు వెల్లడిరచారు. 25న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెంకటాపురం మండలం కొండాపురం గ్రామ శివారులోని బిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు కొండాపురం వైపు నుంచి అలుబాక వైపునకు అనుమానాస్పద స్థితిలో నడుచుకుంటూ బ్రిడ్జి సమీపానికి వచ్చి పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడిరచి పట్టుకున్నామన్నారు. వారి…