నేడు ఖమ్మం వేదికగా బిఆర్ఎస్ యుద్దభేరీ
బిజెపి లక్ష్యంగా సమరశంఖం పూరించనున్న కెసిఆర్ బిజెపికి ప్రత్యామ్నాయం చూపే దిశగా బిఆర్ఎస్ అడుగు వరంగల్ వాయిస్,హైదరాబాద్: ఖమ్మం వేదికగా బిఆర్ఎస్ తొలి బహిరంగసభకు రంగం సిద్దం అయ్యింది. ఈనెల 18న బుధవారం సాయంత్రం జరిగే సభతో బిజెపికి సవాల్ విసిరేందుకు తెలంగాణ సిఎం కెసిఆర్ రంగం సిద్దం చేసుకున్నారు. 9 రాష్టాల్ల్రో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న బిజెపి తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. కెసిఆర్ అవినీతి పాలన అంటూ విమర్శలు చేస్తోంది. తెలంగాణలో అధికారం…