Warangalvoice

GKM

BRS Yuddabheri today at Khammam venue

నేడు ఖమ్మం వేదికగా బిఆర్‌ఎస్‌ యుద్దభేరీ

బిజెపి లక్ష్యంగా సమరశంఖం పూరించనున్న కెసిఆర్‌ బిజెపికి ప్రత్యామ్నాయం చూపే దిశగా బిఆర్‌ఎస్‌ అడుగు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: ఖమ్మం వేదికగా బిఆర్‌ఎస్‌ తొలి బహిరంగసభకు రంగం సిద్దం అయ్యింది. ఈనెల 18న బుధవారం సాయంత్రం జరిగే సభతో బిజెపికి సవాల్‌ విసిరేందుకు తెలంగాణ సిఎం కెసిఆర్‌ రంగం సిద్దం చేసుకున్నారు. 9 రాష్టాల్ల్రో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న బిజెపి తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. కెసిఆర్‌ అవినీతి పాలన అంటూ విమర్శలు చేస్తోంది. తెలంగాణలో అధికారం…

Read More
Active Nagoba fair works

చురుకుగా నాగోబా జాతర పనులు

గంగాజలం కోసం మొస్రం వంశస్థుల యాత్ర ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న అధికారులు వరంగల్ వాయిస్,ఆదిలాబాద్‌: ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటైన నాగోబా జాతరకు మెస్రం వంశస్తులు అంతా సిద్దం చేస్తున్నారు. ఇందుకోసం అట్టహాసంగా ఆలయ ప్రారంభోత్సవ పూజలు ఇప్పటికీ ప్రారంభించారు. ఆదివాసీల ఆరాధ్య దేవుడు నాగోబాకు మెస్రం వంశస్థులు 5 కోట్లతో నిర్మించిన ఆలయ ప్రారంభోత్సవ పూజలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాజగోపురం, దేవాలయ పునరుద్ధరణ, మండప ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఏళ్ల నాటి కళ నెరవేర్చేందుకు…

Read More
The deadline for the new secretariat has been finalized

కొత్త సచివాలయానికి ముహూర్తం ఖరారు

ఫిబ్రవరి 17న ప్రారంభోత్సవం: మంత్రి వేముల వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారయింది. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్‌ జన్మదినం రోజున సెక్రటేరియట్‌ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వెల్లడిరచారు. నూతన సచివాలయానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరును పెట్టిన విషయం తెలిసిందే. 50 నుంచి 200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా దీనిని నిర్మిస్తున్నారు. 20 ఎకరాల…

Read More
Sankranti celebrations in Shilparam

శిల్పారామంలో వైభవంగా సంక్రాంతి సంబరాలు

రెండురోజుల పాటు భారీగా తరలివచ్చిన నగర వాసులు ఆక్టుటకున్న బసవన్నల నృత్యాలు, హరిదాసుల సంకీర్తనలు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: పల్లె సొగసులు… ప్రకృతి అందాలతో నగర ప్రజలకు ఓ గ్రావిూణ ప్రాంతంగా ఆకట్టుకుంటున్న శిల్పారామంలో సంక్రాంతి సందడి నగరవాసులను ఆకట్టుకుంది. పల్లెలకు వెళ్లలేకపోయిన పట్టణవాసులు సంక్రాంతి వేడుకలను ఇక్కడ ఆస్వాదించారు. భోగిమంటలు, రంగురంగుల రంగవల్లికలతో శిల్పారామం స్వాగతం పలుకింది. బసవన్నల నృత్యాలు, హరిదాసుల సంకీర్తనలతో సందడి సందడిగా మారింది. సోమ,మంగళవారాల్లో శిల్పారామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా శిల్పారామంలో ఏర్పాటు…

Read More
Fun filled Sankranti celebrations

సరదాగా సాగిన సంక్రాంతి వేడుకలు

సంక్రాంతి అంటేనే సరదా అన్న రీతిలో పండుగ సాగింది. ప్రజలంతా అష్టకష్టాలు పడి సొంతూళ్లకు వెళ్లి పండగ చేసుకున్నారు. గత మూడేళ్లుగా కరోనా భయాల మధ్య సాగిన పండగ ఇప్పుడు సరదాగా సాగింది. సంస్కృతిని ప్రతిబింబించేవి పండుగలే. ఈ పండుగలు, ఉత్సవాలు, జాతరలు, కొలుపులు మొదలైనవన్నీ మన సంస్కృతిలో భాగం. తెలుగునాట సంక్రాంతిని ముఖ్యమైన పండుగగా చెప్పుకోవచ్చు. తెలుగునాట సంక్రాంతి, తమిళనాడులో పొంగల్‌, కేరళలో ’ఓణం’ ఇటువంటి పండుగే. కన్నడ, మరాఠీ ప్రజలు కూడా ఈ పండుగను…

Read More
Former Union Minister Sharad Yadav passed away

కేంద్ర మాజీమంత్రి శరద్‌ యాదవ్‌ కన్నుమూత

సంతాపం తెలిపిన ప్రధాని మోడీ తదితరులు తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపారన్న కెసిఆర్‌ వరంగల్ వాయిస్,పాట్నా: మాజీ కేంద్ర మంత్రి శరద్‌ యాదవ్‌ (75) గురువారం రాత్రి కన్ను మూశారు. వయోభారంతో బాధ పడుతున్న శరద్‌ యాదవ్‌ను చికిత్స కోసం ఆయన కుటుంబ సభ్యులు గుర్‌గ్రామ్‌లోని ఫొర్టిస్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తు న్నారు. ఆయన పరిస్థితి విషమించడంతో మరణించి నట్లు కూతురు సుభాషిణి శరద్‌ యాదవ్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. జనతాదళ్‌ యునైటెడ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడిగా…

Read More
PM Modi gives green flag to Ganga cruise

గంగా క్రూయిజ్‌కు ప్రధాని మోడీ పచ్చజెండా

వారణాసి నుంచి దిబ్రూగఢ్‌ వరకు 3200 కివిూ ప్రయాణం అత్యంత లగ్జరీ క్రూయిజ్‌గా పలుసౌకర్యాలు వరంగల్ వాయిస్,న్యూఢలిలీ: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్‌ క్రూయిజ్‌ ప్రారంభమయ్యింది. ఎంవీ గంగా విలాస్‌ను ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు వారణాసిలో టెంట్‌ సిటీని ప్రారంభించడంతో పాటు రూ.1000 కోట్ల విలువైన అనేక ఇతర అంతర్గత జలమార్గాల ప్రాజెక్టులకు కూడా మోడీ శంకుస్థాపన చేశారు. భారత్‌లో విూరు ఊహించగలిగేవన్నీ ఉన్నాయని,…

Read More
కంటివెలుగు రెండోదశ ప్రారంభం

ఖమ్మంలో కంటివెలుగు రెండోదశ ప్రారంభం

సిఎం కెసిఆర్‌ చేతులవిూదుగా ప్రారంభించాలని నిర్ణయం సిద్దిపేటలో అధికారులతో సవిూక్షించిన మంత్రి హరీష్‌ రావు వరంగల్ వాయిస్,సిద్దిపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవదశ కంటివెలుగు ప్రారంభం ఖమ్మం జిల్లా నుంచి మొదలవుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడిరచారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు ఇతర రాష్టాల్రకు చెందిన ముఖ్యమంత్రులు సైతం హాజరు కానున్నారని ఆయన తెలిపారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన కంటి వెలుగు అవగాహన సదస్సులో మంత్రి…

Read More
NTR is a prabhanjanam

ఎన్టీఆర్‌ అంటేనే ఓ ప్రభంజనం

విప్లవాత్మక రాజకీయాలకు శ్రీకారం చంద్రబాబు దూరదృష్టితో అభివృద్దికి పెద్దపీట జగన్‌ పాలనలో దోచుకు తింటున్నారు ఆర్థిక వ్యవస్థను దివాళా తీసి అప్రతిష్ట పాల్చేసారు మండిపడ్డ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ వరంగల్ వాయిస్,అనంతపురం: దివంగత ఎన్టీఆర్‌ ప్రభంజనం సృష్టించి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తే..ఆయన వారసుడిగా చంద్రబాబు ఉమ్మడి ఎపిని ఎంతో అభివృద్ది చేశారని అన్నారు. తెలుగువేశం పార్టీ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిందన్నారు. చంద్రబాబునాయుడు ఎంతో ముందు చూపుతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తే..జగన్‌ ధనయజ్ఞం…

Read More
Hyderabad is an ideal city for investment

పెట్టుబడులకు అనువైన నగరంగా హైదరాబాద్‌

హైదరాబాద్‌లో సౌకర్యాలకు ప్రభుత్వం పెద్దపీట పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాలు హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం కాళేశ్వరం ఐటి ప్రతినిధుల ముఖాముఖి భేటీలో మంత్రి కెటిఆర్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పడ్డ తరవాత రాష్ట్రంలో ఐటీరంగం అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నారని చెప్పారు. దేశంలో ఎక్కడికైనా వెళ్లివచ్చి..హైదరాబాద్‌ చూస్తే..ఇక్కడి ప్రగతి కనిపిస్తుందని అన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ ప్రగతి తమకు గర్వకారణమన్నారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులోని…

Read More