District News
బీసీల ప్రత్యేక రాజకీయ పార్టీ రావాలి
రాజకీయ చైతన్యంకై గ్రామాలకు తరలాలి స్థానిక సంస్థల్లో మెజార్టీ సీట్ల గెలుపుకై బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కృషి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ టి.చిరంజీవులు వరంగల్ వాయిస్, హనుమకొండ : బీసీ సమాజ విముక్తి కోసం రాజ్యాధికారం అవసరమని, రాజకీయ చైతన్యం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమని బీసీ ఇంటలెక్టువల్ ఫోరం వ్యవస్థాపక చైర్మన్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి టి.చిరంజీవులు అన్నారు. భారత రత్న జననాయక్ కర్పూరి ఠాకూర్ 102వ జయంతి సందర్భంగా “స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల…
రాజకీయ యుద్ధభేరి సభను సక్సెస్ చేయాలి
యుద్ధభేరి పోస్టర్ ఆవిష్కరణ వరంగల్ వాయిస్, హనుమకొండ : వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఫిబ్రవరి 2న నిర్వహించే బీసీ రాజకీయ యుద్ధ భేరి సభకు ముదిరాజులు మద్దతు తెలుపుతూ గురువారం హనుమకొండలోని హంటర్ రోడ్ లోని ముదిరాజ్ అర్బన్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, భయ్యా స్వామి, పులి రజనీకాంత్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ముదిరాజ్ కులస్తులతో బీసీ రాజకీయ యుద్ధభేరి సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా, ముదిరాజ్…
బీజేపీ దామెర మండల నూతన అధ్యక్షుడిగా వేల్పుల రాజ్ కుమార్
వరంగల్ వాయిస్, దామెర : భారతీయ జనతా పార్టీ దామెర మండలం నూతన అధ్యక్షుడిగా దామెర గ్రామానికి చెందిన వేల్పుల రాజ్ కుమార్ నియామకమయ్యారు. గత 15 సంవత్సరాలుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని వివిధ హోదాలలో ఉమ్మడి జిల్లా యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా, గత స్థానిక ఎన్నికలో బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం దామెర వార్డు మెంబర్ గా, మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసిన సేవలను గుర్తించి దామెర మండల పార్టీ…
Konda Sureka | స్త్రీజాతి విముక్తి కోసం పోరాడి ధీరవనిత.. సావిత్రీబాయి ఫూలే
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వగృహంలో పుష్పాంజలి ఘటించిన మంత్రి వరంగల్ వాయిస్, వరంగల్ : మహిళా సాధికారతకు పర్యాయపదం సావిత్రీబాయి ఫూలే అని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సావిత్రీబాయి ఫూలే 194వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో మంత్రి కొండా సురేఖ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. మహిళలపై తీవ్ర అణచివేత, వివక్ష కొనసాగుతున్న ఆ కాలంలోనే మహిళల విద్య కోసం, స్త్రీజాతి విముక్తి కోసం…
“ఆరోగ్యదర్శి”ని వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణ
వరంగల్ వాయిస్, హనుమకొండ : ఆరోగ్యదర్శిని 10వ వార్షికోత్సవ సంచికను, నూతన సంవత్సర క్యాలెండర్ ను హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , సీనియర్ జర్నలిస్ట్ , వరంగల్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి బుధవారం ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రముఖ హోమియో వైద్యుడు డాక్టర్ పావుశెట్టి శ్రీధర్…
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మోహన్ సింగ్ ఎంజీఎం(పీపీయూనిట్) పరిశీలన వరంగల్ వాయిస్, వరంగల్ : ఎంజీఎం హాస్పిటల్ ఆర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ (పీపీ యూనిట్)ను వర్ధన్నపేట డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్.మోహన్ సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్.మోహన్ సింగ్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలని డాక్టర్ కు, స్టాఫ్ ను కోరారు. ముఖ్యంగా ఆల్ నేషనల్ ప్రోగ్రామ్స్ 100శాతం టార్గెట్ రీచ్ కావాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల…
ఆర్థికంగా బలపడాలంటే రాజ్యాధికారం రావాలి
రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు వరంగల్ వాయిస్, హనుమకొండ : బీసీలు ఆర్థికంగా బలపడాలంటే రాజకీయంగా రాణించాలని అందుకు రాజ్యాధికారం అవసరమని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు పిలుపునిచ్చారు. బీసీ ఐక్యవేదిక మేధావుల సంఘం ఆధ్వర్యంలో హనుమకొండలోని మాస్టర్ జీ డిగ్రీ కళాశాలలో బీసీ ఉద్యమ నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణ, సమస్యల పరిష్కారం అనే అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా చిరంజీవులు హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నో బీసీ సంఘాలు ఉన్నప్పటికీ వారి…
సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్
వరంగల్ వాయిస్, కేయూ : కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డి పురం భగత్సింగ్నగర్ లో మంగళవారం సాయంత్రం సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా మాట్లాడుతూ అక్రమ మద్యం, గంజాయి,గుట్కా, హెల్మెట్ ధరించడం , సీసీ కెమెరాల ప్రాముఖ్యత, 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ వినియోగం పై కాలనీ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ…
ఘనంగా గోకుల్ నగర్ సదర్ ఉత్సవాలు
హాజరైన ఎంపీలు అనిల్ యాదవ్, కడియం కావ్య ,ఎమ్మెల్యే నాయిని… వరంగల్ వాయిస్ , హనుమకొండ : హనుమకొండ గోకుల్ నగర్ లో బంక సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సదర్ సమ్మేళన్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్,వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య పాల్గొన్నారు.. మొదటి సారిగా వరంగల్ లో నిర్వహించడం ప్రత్యేకంగా ఉంది. : నాయిని రాజేందర్…
ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న కారు
ఇద్దరు యువకుల దుర్మరణం వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : వేగంతో వస్తూ అదుపు తప్పిన కారు.. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే దుర్మరణం చెందిన విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి గ్రామ శివారులో సోమవారం చోటు చేసుకుంది. గూడూరు మండలం పోనుగోడు గ్రామానికి చెందిన సంగెం మణికంఠ (17), నీల అరుణ్ కుమార్ (16) ప్రాణస్నేహితులు. మణికంఠ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జ్యోతి బా ఫూలే కళాశాలలో ఇంటర్ ద్వితీయ…