ఏజెన్సీలో విద్యా కుసుమం
ఎంబీబీఎస్ పట్టా స్వీకరించిన సాయిని స్వప్నిల్ జన్మనిచ్చిన గడ్డకు సేవ చేయడమే లక్ష్యమని వెల్లడి వరంగల్ వాయిస్, ములుగు: ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి మెడిసిన్ సాధించి, విజయవంతంగా పూర్తిచేశాడు సరస్వతీ పుత్రుడు సాయిని స్వప్నిల్. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకారాజుపల్లి గ్రామం సాయిని నరేందర్, రోజారమణి ఏకైక పుత్రుడైన సాయిని స్వప్నిల్ 2016 ఎంసెట్ లో మంచి ర్యాంకు సాధించి తెలంగాణ ఏర్పడ్డాక మొదటి మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో…