పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కాంగ్రెస్, బిజెపిలకు విమర్శలే లక్ష్యం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వరంగల్ వాయిస్,హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అగ్రతాంబూలం ఇస్తున్నదని, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. బంగారు తెలంగాణకు భాగ్యనగరాన్ని మణిహారంలా మార్చేందుకు ప్రయత్నిస్తున్నది. మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల జీవన ప్రమాణాల పెంపుదల, అభివృద్ధి వికేంద్రీకరణ వంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా చర్యలు కొనసాగుతున్నాయి. ఇవన్నీ విపక్షాలకు ఎందుకు కానరావడం…