పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్న రాహుల్
సూరత్ కోర్టు తీర్పు తరవాత పార్లమెంట్కు హాజరు వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: సూరత్ కోర్టు తీర్పు అనంతరం రాహుల్ శుక్రవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ ఉదయం పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశానికి రాహుల్ హాజరయ్యారు. అనంతరం లోక్సభ ప్రారంభం కాగానే ఆ సమావేశం లోనూ పాల్గొన్నారు. కోర్టు తీర్పుతో రాహుల్పై అనర్హత వేటు పడే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్న తరుణంలో పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది….