అర్ధరాత్రి అరుణోదయం
అరవయ్యేండ్ల సంగ్రామం తరువాత భారత జాతి విముక్తిని సాధించింది. 15 ఆగస్టు 1947 భారత జాతికి వెలుగుల దినం, ఉత్సవ దినం, పర్వదినం, పరువాల దినం. భారత జాతికి రెండు శతాబ్దాల అంగ్రేజుల దాస్యం నుంచి విముక్తి గలిగింది. ఇది స్థూల దృష్టి. భారతజాతి ఎన్నో శతాబ్దాలుగా ‘స్వరాజ్యం’ కోల్పోయింది. సురాజ్యమూ నష్టపోయింది. మనం స్వరాజ్యం సాధించుకున్నం. ఇక మనను పైవాడు పాలించాడు. మనమే పాలించుకుంటాం. ఇది మన దేశం. దీనిని మనమే చక్కబరచుకుంటాం. 1947 ఆగస్టు…