అందుబాటులోకి లగ్జర్టీ బస్సులు
లాంఛనంగా ప్రారంభించిన పువ్వాడ వరంగల్ వాయిస్,హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ తొలిసారిగా ప్రయాణికుల కోసం ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రైవేటు బస్సులకు దీటుగా ఆధునిక హంగులతో కూడిన 16 ఏసీ స్లీపర్ కోచ్ బస్సులను ప్రవేశపెట్టింది. ఈ బస్సులకు ’లహరి` అమ్మఒడి అనుభూతి’గా ఆర్టీసీ నామకరణం చేసింది. సోమవారం ఈ కొత్త బస్సులను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ…