తెలంగాణ హైకోర్టులో కేసు వాదిస్తుండగా న్యాయవాదికి గుండెపోటు
తెలంగాణ హైకోర్టులో విషాదం నెలకొంది. హైకోర్టులో కేసు వాదిస్తుండగా ఓ న్యాయవాది గుండెపోటుకు గురయ్యాడు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో విషాదం నెలకొంది. హైకోర్టులో కేసు వాదిస్తుండగా ఓ న్యాయవాది గుండెపోటుకు గురయ్యాడు. కోర్టు హాలులోనే న్యాయవాది కుప్పకూలిపోయాడు. దీంతో అప్రమత్తమైన జడ్జి, ఇతర న్యాయవాదులు.. బాధిత న్యాయవాదిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే న్యాయవాది మృతి చెందినట్లు ఉస్మానియా వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన న్యాయవాదిని వేణుగోపాలరావుగా గుర్తించారు….