Grain Purchasing Centers : కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలి : ఎమ్మెల్యే వేముల వీరేశం
వరంగల్ వాయిస్, కట్టంగూర్ : రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అలాగే పలుచోట్ల సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు తన ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో…