Harish Rao | హెచ్సీయూ ప్రొఫెసర్లు, విద్యార్థులపై లాఠీఛార్జ్.. తీవ్రంగా ఖండించిన హరీశ్రావు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ శాంతియుతంగా నిరసన చేపట్టిన హెచ్సీయూ ప్రొఫెసర్లు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గత నాలుగు రోజుల నుంచి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఉదయం శాంతియుతంగా నిరసన చేపట్టిన ప్రొఫెసర్లు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని…